న్యూఢిల్లీ, జూలై 26: ప్రపంచ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్తగా ఇందర్మిత్ గిల్ నియమితులయ్యారు. దీంతో కౌశిక్ బసు తర్వాత ఈ గౌరవాన్ని అందుకున్న రెండో భారతీయుడిగా గిల్ నిలిచారు. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి గిల్ నియామకం అమల్లోకి రానున్నట్టు ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. అలాగే అభివృద్ధి గా కూడా ఎన్నికయ్యారు. వృద్ధి, పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పులు తదితర కీలక అంశాల్లో ఆయా దేశాల ప్రభుత్వాలతో కలిసి గిల్ పనిచేస్తారు. గిల్ ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్లో ఆర్థిక, సమాన వృద్ధి, ఇన్స్టిట్యూషన్స్ విభాగాలకు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో డ్యూక్ విశ్వవిద్యాలయం అధ్యాపకుడిగా కూడా ఈయన పనిచేశారు.
మొత్తానికి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో భారతీయులకు ఘనమైన గౌరవమే దక్కుతున్నది. 2012 నుంచి 2016 మధ్య ప్రపంచ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్తగా బసు సేవలందించారు. ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ప్రధాన ఆర్థికవేత్తలుగా భారతీయులైన రఘురామ్ రాజన్, గీతా గోపీనాథ్లూ ఎంపికైన విషయం తెలిసిందే. కాగా, మధ్య, దిగువశ్రేణి ఆదాయ దేశాలకు ప్రపంచ బ్యాంక్ రుణాలను మంజూరు చేస్తుందన్న సంగతి విదితమే.