న్యూఢిల్లీ : పని ప్రదేశంలో తన పట్ల దురుసుగా వ్యవహరించారనే కోపంతో మహిళ కంపెనీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన మేనేజర్ పాస్వర్డ్ మార్చి ఏకంగా సంస్ధ డేటాబేస్ను ట్యాంపర్ చేసింది. కంపెనీ డేటాబేస్కు టీం యాక్సెస్ను పూర్తిగా బ్లాక్ చేసింది. ఉద్యోగంలో తన పట్ల కంపెనీ వివక్ష చూపినందుకు ప్రతీకారంతోనే తాను ఇలా చేశానని మహిళ చెప్పుకొచ్చింది.
తన టీంలో ఒకే ఒక్క మహిళనైన తన పట్ల టీం ఎలా వ్యవహరించిందో సదరు మహిళ రెడిట్లో షేర్ చేసింది. పని ప్రదేశంలో సరైన వాతావరణం కొరవడితే ఎలాంటి పరిస్ధితికి దారితీస్తుందో ఈ ఘటన విస్పష్టంగా వెల్లడించింది. ఉద్యోగంలో తనను తోటి ఉద్యోగులు ఎంతటి ఒత్తిడికి అభద్రతకు గురిచేశారో చెప్పనలవి కాదని ఆమె పేర్కొంది. తన టీం సభ్యులతో తానెన్నడూ దురుసుగా ప్రవర్తించలేదని రెడిట్ పోస్ట్లో వివరించింది.
తాను రెస్టారెంట్ను వీడి వారం రోజులైనా మేనేజర్ పాస్ట్వర్డ్ తన వ్దే ఉందని, కంపెనీలో ఇతరుల లాగిన్స్కు ఉపయోగించే మేనేజర్ పాస్వర్డ్ను మార్చాలని తాను నిర్ణయించానని ఆమె తెలిపింది. తనను బాధించే ఘటన జరిగిన క్రమంలో ఓ రోజు సాయంత్రం పని విడిచిపెట్టి అర్ధంతరంగా బయటకు వచ్చానని, కొలీగ్స్ నుంచి వాట్సాప్ కాల్స్ వచ్చినా పట్టించుకోలేదని పోస్ట్లో రాసుకొచ్చింది.
Read More :