Sahitya Akademi Award | కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను బుధవారం ప్రకటించారు. మొత్తం 24 భాషల సాహితీకారులను అవార్డులకు ఎంపిక చేసినట్లు అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటించారు. తెలుగు నుంచి ‘రామేశ్వరం కాకులు.. మరికొన్ని కథలు’ పుస్తకానికి అవార్డు వరించింది. లఘు కథల పుస్తకాన్ని తల్లవజ్జల పతంజలి శాస్త్రి రచించారు.