Wipro Q2 Results | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో సెప్టెంబర్తో ముగిసిన రెండో ఐటీ దిగ్గజం విప్రో (Wipro) నికర లాభం చాలా స్వల్పంగా 0.70 శాతం పెరిగి రూ.2,667.3 కోట్లకు చేరుకున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో విప్రో నికర లాభం రూ.2,649.10 కోట్లు మాత్రమే. మార్కెట్ విశ్లేషకుల అంచనాలను అందుకోవడంలో విప్రో వెనుకబడింది. విప్రో ద్వితీయ త్రైమాసికం నికర లాభం రూ.2800 కోట్లు, రెవెన్యూ రూ.22,810 కోట్లు ఉంటుందని మార్కెట్ వర్గాలు విశ్లేషించాయి.
ఐటీ సర్వీస్ సెగ్మెంట్ రెవెన్యూ 2.3 శాతం తగ్గియి 2713.3 మిలియన్ డాలర్లకు పడిపోయింది. ఐటీ ప్రొడక్ట్స్ విభాగం రెవెన్యూ రూ.14,700 కోట్లు ఉండగా, మొత్తం ఐటీ విభాగంలో రూ.47 కోట్ల నష్టం వాటిల్లిందని ఎక్స్చేంజ్లకు ఇచ్చిన ఫైలింగ్లో విప్రో తెలిపింది. విప్రో కన్సాలిడేటెడ్ రెవెన్యూ గతేడాదితో పోలిస్తే 0.10 శాతం తగ్గిపోవడం గమనార్హం. గతేడాది రూ.22,539.70 కోట్ల రెవెన్యూ లభించగా, ఈ ఏడాది రూ.22,515.90 కోట్లకు పరిమితమైంది.