బెంగళూర్ : దేశీ ఐటీ దిగ్గజం విప్రో (Wipro) గురువారం కీలక ప్రకటన చేసింది. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్వో) జతిన్ దలాల్ తన పదవికి రాజీనామా చేశారని విప్రో వెల్లడించింది. కంపెనీలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేసిన అనంతరం దలాల్ ఇతర అవకాశాలను అన్వేషిస్తూ విప్రో నుంచి వైదొలిగారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
దలాల్ స్ధానంలో విప్రోలో 20 ఏండ్లకు పైగా సేవలందిస్తున్న అపర్ణా అయ్యర్ను నియమించినట్టు పేర్కొంది. సెప్టెంబర్ 22 నుంచి అపర్ణా అయ్యర్ నియామక ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఎక్స్ఛేంజ్లకు సమాచారం అందించింది.
తమ ఆర్ధిక సేవలు, వ్యూహాలు, పెట్టుబడి ప్రణాళికల్లో అయ్యర్ కీలక పాత్ర పోషిస్తున్నారని విప్రో సీఈవో థియర్రీ డెలపోర్టే ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక దలాల్ 2002లో విప్రోలో అడుగుపెట్టి ఆపై 2015లో కంపెనీ ప్రెసిడెంట్, సీఎఫ్వో అయ్యారు. నవంబర్ 30న విప్రో నుంచి దలాల్ వైదొలుగుతారని కంపెనీ వెల్లడించింది.
Read More :
Visa Services | కెనడాలో వీసా సేవలను నిలిపివేసిన భారత్