ITR filing | గత ఆర్థిక సంవత్సర ఐటీ రిటర్న్స్ (ఐటీఆర్) సమర్పించడానికి ఈ నెలాఖరుతో గడువు ముగుస్తున్నది. ఈ దఫా ఐటీ ఫైలింగ్లో ఆదాయం పన్నుశాఖ తీసుకొచ్చిన మార్పులను పన్ను చెల్లింపు దారులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వివిధ స్టాక్స్పై పెట్టే పెట్టుబడులపై వచ్చే డివిడెండ్ ఆదాయాన్ని వెల్లడించాలన్న నిబంధన తీసుకొచ్చింది. దీని ప్రకారం తమకు వచ్చే డివిడెండ్ ఆదాయాన్ని మూడు నెలలకోసారి పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్లో వెల్లడించాలి. మూడు నెలలకోసారి డివిడెండ్ ఆదాయం బ్రేకప్ వివరాలు తెలిపితే, వారిపై పన్నుభారం తగ్గుతుంది.
ఐటీఆర్లో తీసుకొచ్చిన మార్పుల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ల రూపేణా వచ్చిన ఆదాయం రూ.10 లక్షల్లోపు ఉంటే పన్ను భారం పడదు. రూ.10 లక్షలకు పైగా డివిడెండ్ ఆదాయం ఉంటే పది శాతం పన్ను చెల్లించాలి. అడ్వాన్స్పన్ను చెల్లింపులో డిఫాల్టైతే.. పన్ను చెల్లింపుదారులు తాము త్రైమాసికం వారీగా పొందే డివిడెండ్ ఆదాయం పూర్తి వివరాలు చెల్లించాలి. అప్పుడు చెల్లించాల్సిన పన్నుపై వడ్డీని ఐటీ అధికారులు అంచనా వేస్తారు. సాధారణ పన్ను చెల్లింపు దారులకు కూడా డివిడెండ్ ఆదాయం వస్తూ ఉంటే, త్రైమాసికం వారీగా బ్రేకప్ ఇవ్వాల్సిందే. అలా బ్రేకప్ ఇవ్వని వారి ఐటీ రిటర్న్స్ తిరస్కరణకు గురవుతాయి.
ఒకవేళ డివిడెండ్పై అడ్వాన్స్ పన్ను పేమెంట్స్ చేయలేకపోతే పెనాల్టీ ఇంటరెస్ట్ నుంచి ఇంతకు ముందు ఐటీ శాఖ మినహాయింపు ఇచ్చింది. కానీ వివిధ కార్పొరేట్ సంస్థలు, కంపెనీలు తప్పనిసరిగా తమ వాటాదారులకు చెల్లించే డివిడెండ్ వివరాల సమాచారం ప్రకటించాలని ఐటీ శాఖ స్పష్టంచేసింది. దీని ప్రకారం ముందస్తు పన్ను చెల్లింపుదారులు ఈ ఏడాదిలో పొందే డివిడెండ్ ఆదాయాన్ని ఐటీఆర్లో పొందు పర్చాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఫామ్ తిరస్కరణకు గురి కాకుండా త్రైమాసికం వారీగా ఇలా బ్రేకప్ ఇవ్వాలి..