న్యూఢిల్లీ, అక్టోబర్ 21: కొటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి(ఎండీ, సీఈవో)గా అశోక్ వాస్వానీ నియమితులయ్యారు. మూడేండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ నియామకానికి రిజర్వుబ్యాంక్ ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం బార్క్లేస్లో ఉన్నతాధికారిగా విధులు నిర్వహించిన వాస్వానీ..ఉదయ్ కొటక్ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం వాస్వానీ అమెరికా-ఇజ్రాయిల్ ఫిన్టెక్ సంస్థ పాగయ టెక్నాలజీ ప్రెసిడెంట్గా విధులు నిర్వహిస్తున్నారు.
క్యూ2 లాభం 3,191 కోట్లు
గత త్రైమాసికానికిగాను రూ.3,191 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది బ్యాంక్. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,581 కోట్లతో పోలిస్తే 24 శాతం అధికం. బ్యాంక్ రూ.13,507 కోట్ల ఆదాయాన్ని గడించింది. సమీక్షకాలంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 2.08 శాతం నుంచి 1.72 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ 0.55 శాతం నుంచి 0.37 శాతానికి దిగొచ్చింది.