Forbes list : అమెరికాకు చెందిన ఫోర్బ్స్ మ్యాగజైన్ భారతదేశంలోని వంద మంది సంపన్నుల జాబితా-2022ను విడుదల చేసింది. ఈ వంద మంది సంపాదన 800 బిలియన్ డాలర్లు అని ఫోర్బ్స్ వెల్లడించింది. ఈ ఏడాదిలో స్టాక్ మార్కెట్ పతనంతో పాటు రూపాయి విలువ 10 శాతం పడిపోయినప్పటికీ వీళ్ల సంపాదన పెరగడం గమనార్హం. ఈ లిస్ట్లో టాప్ 10లో ఎవరెవరు ఉన్నారంటే.. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ ఆదానీ 150 బిలియన్ డాలర్ల (రూ. 1,211,460.11 కోట్లు) ఆదాయంతో మొదటి స్థానంలో నిలిచాడు. 88 బిలియన్ డాలర్ల (రూ.710,723.26 కోట్లు)తో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ రెండో స్థానం సొంతం చేసుకున్నాడు.
డీమార్ట్ రిటైల్ సూపర్మార్కెట్ డీమార్ట్ యజమాని రాధాకిషన్ దమనీ రూ. 222,908.66 కోట్ల సంపాదనతో మూడోస్థానంలో ఉన్నాడు. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ సైరస్ పూనావాలా (రూ.173, 642.62 కోట్లు) నాలుగో ప్లేస్లో, హెచ్సీఎల్ సంస్థ యజమాని శివ్ నాడార్ (రూ. 172,834.97కోట్లు) ఐదో ప్లేస్లో ఉన్నారు. ఓపీ జిందాల్ ఛైర్ పర్సన్ సావిత్రి జిందాల్ రూ. 132, 452.97 కోట్ల ఆదాయంతో ఆరో ప్లేస్ దక్కించుకున్నారు. సన్ఫార్మాసూటికల్స్ స్థాపకుడు దిలీప్ సంఘ్వీ (రూ.125,184.21కోట్లు) ఏడో స్థానం, హిందూజ బ్రదర్స్ (రూ.122,761.29కోట్లు) ఎనిమిదో ప్లేస్లో, కుమార మంగళం బిర్లా రూ.121,146.01కోట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచారు. రూ.117,915.45 కోట్ల ఆదాయంతో బజాజ్ ఫ్యామిలీ పదో ప్లేస్లో నిలిచింది. ఈ పది మంది సంపాదన 350 బిలియన్ డాలర్లు ఉంటుందని ఫోర్బ్స్ తెలిపింది.