WhatsApp | ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. తన యూజర్ల కోసం నిత్యం కొత్త ఫీచర్లు తీసుకొస్తూనే ఉంది. గతేడాది హెచ్డీ క్వాలిటీ గల ఫోటోలు / వీడియోలు షేర్ చేసేందుకు 2జీబీ ఫైల్ షేరింగ్ ఫీచర్ తెచ్చిన వాట్సాప్.. తాజాగా మరో ఫీచర్ అందుబాటులోకి తెస్తున్నది. ఈ ఫీచర్తో ఇంటర్నెట్ ఉన్నా, లేకున్నా పక్కన ఉన్న వారిలో ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు ‘నియర్ బై షేర్’, ఐఓఎస్ యూజర్లకు ‘ఎయిర్ డ్రాప్’ తరహాలో పని చేస్తుంది ఈ ఫీచర్. ప్రస్తుతం పరీక్షిస్తున్నట్లు వాట్సాప్ వాబీటా ఇన్ ఫో పేర్కొంది. ఆండ్రాయిడ్ 2.24.2.17 వర్షన్ గల వారికి ప్రస్తుతం ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
ఇంతకుముందు ఫోటోలు, ఆడియోలు, వీడియోలు, డాక్యుమెంట్ల షేరింగ్ కోసం తెచ్చిన ‘షేర్ ఇట్’ యాప్ మీద కేంద్రం నిషేధం విధించింది. దీంతో గూగుల్ తన ఆండ్రాయిడ్ యూజర్లకు ‘నియర్ బై షేర్’ ఫీచర్ తెచ్చింది. దీంతో ఒకరికన్నా ఎక్కువ మందికి ఫైల్స్ షేర్ చేయొచ్చు. కేబుల్స్, నెట్ వర్క్ అవసరం లేకుండా ఒక ఫోన్ నుంచి మరో ఫోన్ కనెక్టివిటీతో ఫైల్స్ షేర్ చేయొచ్చు. ఈ తరహాలోనే వాట్సాప్ ‘పీపుల్ నియర్ బై’ ఫీచర్ తెస్తున్నది. దీనివల్ల యూజర్ల ప్రైవసీకి ఇబ్బంది రాకుండా ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ సెక్యూరిటీ కల్పిస్తున్నట్లు వాబీటా ఇన్ఫో తెలిపింది.