Whatsapp | ప్రముఖ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ ఎప్పటికప్పుడు తన యూజర్లకు కొత్త ఫీచర్లు, అప్డేట్స్ అందిస్తూ రూపు మార్చుకుంటున్నది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ వర్షన్ యూజర్లకు సెక్యూరిటీ అప్ డేట్స్ కూడా ఇస్తోంది. దీంతోపాటు పాత వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ గల ఫోన్లకు తన సపోర్ట్ నిలిపేస్తున్నది. తాజాగా ఆండ్రాయిడ్ 4.1 వర్షన్ ఓఎస్ వాడుతున్న 18 రకాల స్మార్ట్ ఫోన్లకు వచ్చేనెల 24 నుంచి తన సపోర్ట్ నిలిపేస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది.
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పాత తరం, తక్కువ మంది వాడే ఫోన్లకు తమ సపోర్ట్ విత్ డ్రా చేస్తున్నట్లు తెలిపింది. ఆండ్రాయిడ్ 4.1, అంతకంటే తక్కువ ఓఎస్ వర్షన్తో పని చేస్తున్న ఫోన్లను వాట్సాప్ గుర్తించింది. ఈ ఫోన్లు వాడుతున్న వారు కొత్త డివైజ్కు అప్ గ్రేడ్ కావాల్సి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ నోట్ 2, హెచ్టీసీ వన్, సోనీ ఎక్స్ పీరియా జడ్, ఎల్జీ ఆప్టిమస్ జీ ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎస్2, శాంసంగ్ గెలాక్సీ నెక్సాస్, హెచ్టీసీ సెన్సేషన్, మోటరోలా డ్రాయిడ్ రేజర్, సోనీ ఎక్స్ పీరియా ఎస్2, మోటరోలా జూమ్, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ 10.1, అసుస్ఈ ప్యాడ్ ట్రాన్స్ ఫార్మర్, ఎసేర్ ఐసోనియా టాబ్ ఏ5003, శాంసంగ్ గెలాక్సీ ఎస్, హెచ్టీసీ డిజైర్, ఎల్జీ ఆప్టిమస్ 2 ఎక్స్, సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా ఆర్క్3, నెక్సస్ ఫోన్లు వాట్సాప్ ప్రకటించిన జాబితాలో ఉన్నాయి.