హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సారథ్యంలో కొనసాగుతున్న ‘వీ-హబ్’ని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి గురువారం సందర్శించారు. వీ-హబ్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఇలాంటి ప్లాట్ ఫామ్ ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. వీ-హబ్ బృందంతో జరిగిన సమావేశంలో చైర్ పర్సన్ సునిత లక్ష్మారెడ్డి, సీఈవో దీప్తి రావుల ప్రశంసించారు. మహిళా పారిశ్రామిక వేత్తల కోసం ఏర్పాటైన ఏకైక కేంద్రం వీ హబ్ అని ఆమె పేరొన్నారు. వీ హబ్ ఇప్పటికే 2,194 స్టార్టప్లను రూప కల్పన చేసిందని ఆమె అన్నారు. మహిళలకు ఎలాంటి సమస్య వచ్చిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఉందని గుర్తు చేసారు.