హైదరాబాద్, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) తమ ఉత్పత్తులను వాల్మార్ట్ స్టోర్స్తోపాటు ఫ్లిప్కార్ట్, ఇతర అంతర్జాతీయ ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్లలో విక్రయించేందుకు అవసరమైన శిక్షణను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాల్మార్ట్తో ఒప్పందం కుదుర్చుకున్నది.
ఈ ఒప్పందంలో భాగంగా డిజిటల్, దేశీయ మార్కెట్, ఇండస్ట్రీ నిపుణుల పర్యవేక్షణ, నెట్వర్క్ వృద్ధి తదితర అంశాలపై ఉచితంగా శిక్షణను ఇవ్వనున్నారు. అలాగే, వ్యాపార మెళుకువలు, ఆధునిక వ్యాపార నిర్వహణ పద్ధతుల గురించి కూడా వివరించానున్నారు.