Volkswagen | ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వ్యాగన్ ఏజీ భారత్ మార్కెట్లో వచ్చే ఏడాది తొలి విద్యుత్ కారు విక్రయానికి ప్రణాళి రూపొందిస్తున్నది. `ఐడీ.4` అనే పేరుతో వచ్చే స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్యూవీ) కారును వచ్చే ఏడాది పరిమితంగా భారత్లో విక్రయించనున్నది. వచ్చే సెప్టెంబర్లో `ఐడీ.4` ఎలక్ట్రిక్ కారును ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నది. భారత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన మార్పులు తేనున్నట్లు ఫోక్స్ వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ డివిజన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ అశీష్ గుప్తా తెలిపారు. పరీక్షలు పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది పరిమిత సంఖ్యలో కార్లు దిగుమతి చేసుకుంటామని గురువారం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఎటువంటి అధికారిక అనుమతులు అవసరం లేకుండా కేవలం 2500 కార్లను దిగుమతి చేసుకునేందుకు కార్ల తయారీ సంస్థలకు అనుమతి ఇచ్చింది. ఈ పరిమితికి అనుగుణంగానే ఎలక్ట్రిక్ కార్లను భారత్ మార్కెట్లోకి తీసుకొస్తామన్నారు అశీష్ గుప్తా. అయితే, ప్రపంచ వ్యాప్తంగా సప్లయ్ చైన్లో ఇబ్బందుల వల్ల 2500 కార్లను దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.
2025 నుంచి 2027 నాటికి భారత్లో ఎలక్ట్రిక్ కార్ల అసెంబ్లింగ్ ప్రారంభిస్తామని ఫోక్స్ వ్యాగన్ అంచనా వేస్తున్నది. అప్పటికల్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ఖర్చుతో కూడుకున్నదైన బ్యాటరీలను భారత్లో సొంతంగా తయారు చేయగలమని భావిస్తున్నది. ప్రపంచంలోకెల్లా భారత్ నాలుగో అతిపెద్ద మార్కెట్. ఎలక్ట్రిక్ కార్ల విక్రయానికి అంతర్జాతీయ సంస్థలు పోటీ పడతాయని భావిస్తున్నారు. హోండా మోటార్స్ వారి తొలి హైబ్రీడ్ ఎలక్ట్రిక్ కారు కంటే ఫోక్స్ వ్యాగన్ ఈవీ రూ.1.95 మిలియన్ల (25 వేలడాలర్లు )కు లభించనున్నది.