హైదరాబాద్, మే 5: ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా.. ప్రత్యేక రీచార్జి ప్లాన్లపై 5జీబీ డాటాను అదనంగా అందిస్తున్నది. రూ.299 కంటే అధిక రీచార్జి చేసుకున్నవారు 5జీబీ డాటాను పొందవచ్చును.
ఈ డాటా కేవలం మూడు రోజుల్లోగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. అలాగే రూ.199, 299 రీచార్జిలపై 2జీబీ డాటా లభించనున్నది. ఇందుకోసం అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది.