న్యూఢిల్లీ, జనవరి 11: వొడాఫోన్ ఐడియా (వీఐ)పై చండీగఢ్లోని కేంద్ర వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అదనపు కమిషనర్ కార్యాలయం రూ.13.16 కోట్ల జరిమానా వేసింది.
జీఎస్టీ విధానానికి సెంట్రల్ వ్యాట్ క్రెడిట్ బదిలీ తప్పులకుగాను ఈ ఫైన్ పడింది. ఈ జరిమానాను న్యాయపరంగా సవాల్ చేస్తామని కంపెనీ చెప్తున్నది.