హైదరాబాద్, డిసెంబర్ 19: ప్రముఖ డయాగ్నోస్టిక్ సేవల సంస్థ విజయా డయా గ్నోస్టిక్.. పుణెకు చెందిన పీహెచ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ను హస్తగతం చేసుకున్నది. పూర్తిగా నగదు రూపంలో జరిగిన ఈ ఒప్పందం విలువ రూ.134.65 కోట్లు. ఇందుకు సంబంధించి మంగళవారం బోర్డు డైరెక్టర్లు సమావేశమై ఇరు సంస్థల మధ్య షేర్ల కొనుగోలు ఒప్పందానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు విజయా డయాగ్నోస్టిక్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
దీంతోపాటు రూ.12.85 కోట్లను ఈక్విటీ రూపంలో లేదా పీహెచ్కి ఉన్న రుణాలను తీర్చడానికి విజయా వెచ్చించనున్నది. ఈ ఒప్పందం పూర్తైన తర్వాత పీహెచ్..విజయా డయాగ్నోస్టిక్ అనుబంధ సంస్థగా మారనున్నది. పుణె కేంద్రంగా 23 ఏండ్లకు పైగా డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తున్నది పీహెచ్. ఈ సంస్థకు మూడు హబ్ సెంటర్లలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ రేడియాలజీ ఎంఆర్ఐ/సీటీ, మరో మూ డు స్పోక్ సెంటర్లు కూడా ఉన్నాయి. వీటిలో ఈసీజీ, ఎక్స్-రే, అల్ట్రాసౌండ్, ఫ్రాంచైజ్ సెంటర్ల ద్వారా డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తున్నది. తమ వ్యాపారాన్ని ఇతర నగరాలకు విస్తరించాలనే ఉద్దేశంతో పీహెచ్ని కొనుగోలు చేసినట్టు విజయా తెలిపింది.