న్యూఢిల్లీ, మే 30: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వెంకటేశ్ కులకర్ణి నియమితులయ్యారు. ఈ నియామకం జూన్ 1 నుంచి అమలులోకి రానున్నది. కంపెనీ ఉత్పత్తి, ప్రొక్యూర్మెంట్, భవిష్యత్తులో విడుదల చేసే ఈవీలు, డిజిటలైజేషన్, టెక్నాలజీ పరంగా స్మార్ట్ ఉత్పత్తులపై ఆయన దృష్టి సారించనున్నారు.
2008లో బెంజ్లో రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండియాలో చేరిన కులకర్ణి.. ఆ తర్వాతి క్రమంలో ఇంటర్నేషనల్ హబ్గా తీర్చడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. బెంజ్లో చేరకముందు ఆయన..టాటా మోటర్స్, మారుతి సుజుకీల్లో పనిచేశారు