SUV | న్యూఢిల్లీ, మార్చి 1: వాహన విక్రయాలు టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. ఇదేక్రమంలో దేశవ్యాప్తంగా స్పోర్ట్ యుటిలిటీ వాహనాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో గతనెలకుగాను అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆటోమొబైల్ దిగ్గజాలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్లు సింగిల్ డిజిట్ను వృద్ధిని నమోదు చేసుకోగా..మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్, హోండా కార్స్లకు చెందిన మాడళ్లకు డిమాండ్ అధికంగా నమోదైంది. దేశీయ ఆటోమొబైల్ రంగంలో అత్యధికంగా అమ్ముడైన వాహనాల జాబితాలో ఇది మూడోసారి. ఈ ఏడాది జనవరిలో అత్యధికంఆ 3,94,500 యూనిట్లతో తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి 3,91,811 యూనిట్లతో అక్టోబర్ 2023 రెండో స్థానంలో నిలిచింది.
ప్యాసింజర్ వాహన విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వరుసగా 14 నెలలో కూడా ఎస్యూవీల సేల్స్ దూసుకుపోయాయి. ప్రస్తుత ఆర్థిఖ సంవత్సరంలో 16 లక్షల వాహనాలు అమ్ముడయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఇండస్ట్రీ 42.1 లక్షల యూనిట్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నా.
– శశాంక్ శ్రీవాత్సవ, మారుతి సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్