హైదరాబాద్, డిసెంబర్ 13: ప్రముఖ రిటైల్ సంస్థ వాల్యూ జోన్..హైదరాబాద్లో హైపర్ మార్ట్ను ప్రారంభించబోతున్నది. పటాన్చెరు వద్ద ఏర్పాటు చేసిన ఈ హైపర్ మార్ట్ను ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఈ నెల 15న ప్రారంభించనున్నారు. నగరవాసులకు సరికొత్త షాపింగ్ అనుభవం కల్పించాలనే ఉద్దేశంతో ఈ హైపర్ మార్ట్ను ఏర్పాటు చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. షాపింగ్ అంటే కేవలం వస్తువులను కొనుగోలు చేయడం మాత్రమే కాదని. ఒక అనుభవంగా ఊహించుకునేందుకుగాను సరికొత్తగా డిజైన్ చేసినట్లు వెల్లడించింది. కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి 40 శాతం రాయితీ ఇస్తున్నట్టు తెలిపింది.