హైదరాబాద్, సెప్టెంబర్ 6: దక్షిణాదికి చెందిన ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ వైభవ్ జ్యూవెల్లర్స్..క్యాపిటల్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది కూడా. ఈ ఐపీవో ద్వారా రూ.210 కోట్ల నిధులను సేకరించాలని సంస్థ భావిస్తున్నది. దీంతోపాటు కంపెనీ ప్రమోటర్ గ్రంధి భారత మల్లిక రత్న కుమారి(హెచ్యూఎఫ్)కి చెందిన 43 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్-ఫర్ సేల్ రూట్లో విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఐపీవో ద్వారా సేకరించిన నిధులను భవిష్యత్తు వ్యాపార విస్తరణకోసం, ఇన్వెంటరీని కొనుగోలు చేయడానికి ఖర్చు చేయనున్నట్లు తెలిపింది.