ముంబై, డిసెంబర్ 1: అమెరికా సంస్థలు వరుసగా భారత్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పటికే గూగుల్, ఫేస్బుక్లు వేలాది కోట్ల రూపాయిలు ఇన్వెస్ట్ చేయగా..తాజాగా న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న టీఎఫ్సీసీ ఇంటర్నేషనల్ కూడా ఇదే జాబితాలోకి చేరింది. చెన్నైకు చెందిన రామ్చరణ్ కో సంస్థలో 46 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఒప్పందం విలువ 4.14 బిలియన్ డాలర్లు(రూ.31 వేల కోట్లకు పైగా). కెమికల్స్, రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ పెట్టుబడులు పెడుతున్నది అమెరికా సంస్థ. ఇప్పటికే దక్షిణాసియాలో 20 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టిన టీఎఫ్సీసీ..భారత్లో పెట్టుబడి పెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం.