UPI offline Payments | ఆఫ్లైన్లోనూ స్మార్ట్ ఫోన్ల ద్వారా డిజిటల్ చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కొత్త యాప్ తేనున్నది. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ యాప్ త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానున్నది. వివిధ బ్యాంకుల ఖాతాలను ఒకే మొబైల్ ప్లాట్ఫామ్ కిందకు తెచ్చేందుకు యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ)ని పరిచయం చేసింది ఎన్పీసీఐ. ఇప్పటి వరకు ఆన్లైన్లో స్మార్ట్ ఫోన్ యూజర్లకు మాత్రమే యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నెట్ లేకుండానే ఆఫ్లైన్లో కొద్ది రోజుల క్రితం ఫీచర్ ఫోన్ యూజర్లకూ యూపీఐ డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి తెచ్చింది.
స్మార్ట్ ఫోన్ యూజర్లు కూడా ఇంటర్నెట్ లేని ప్రాంతాల్లో యూపీఐ ద్వారా చెల్లింపుల కోసం కొత్త యాప్ తెస్తున్నది. యూపీఐ లైట్ ఆన్ డివైజ్ వ్యాలెట్ (UPI Lite On Device Wallet) అనే పేరుతో ఈ యాప్ రానున్నది. ప్రస్తుతం దేశంలో రోజూ 100 కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయని ఎన్పీసీఐ నివేదిక చెబుతున్నది. యూపీఐ చెల్లింపులకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు తగ్గట్లుగా బ్యాంకులు తమ పేమెంట్స్ వ్యవస్థలో మౌలిక వసతులు మార్పులు చేసుకోవాలి. ఇందుకు నిధులు భారీ ఖర్చవుతాయి మరి. దీనివల్ల బ్యాంకులపై భారం పడనుంది.
ఈ సమస్య పరిష్కారానికి ఎన్పీసీఐ యూపీఐ లైట్ యాప్ తీసుకొస్తున్నది. ఆఫ్లైన్లో మాత్రం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం సాధ్యం కాదని తెలిసింది. అలాగే ఆఫ్లైన్లో యూపీఐ లైట్ ఆన్ డివైజ్ వ్యాలెట్ యాప్ ద్వారా పేమెంట్స్పై పరిమితి విధించింది. దీని ద్వారా కేవలం రూ.200 లోపు మాత్రమే పే చేయొచ్చు. అయినా ఎన్పీసీఐ ద్వారా సాగే పేమెంట్స్లో రూ.100లోపు 75 శాతం, రూ.200 లోపు 50 శాతం ఉంటున్నాయని సమాచారం.