న్యూఢిల్లీ : భారత్ మార్కెట్లోకి నవంబర్లో పలు కార్లు, న్యూ మోడల్స్ సందడి చేయనున్నాయి. పండుగ సీజన్ నేపధ్యంలో న్యూ లాంఛ్లతో ఆటోమొబైల్ దిగ్గజాలు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు నవంబర్ను ఎంచుకున్నాయి. అత్యాధునిక ఫీచర్లతో పాటు సరికొత్త జోడింపులతో న్యూ లాంఛ్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆయా కంపెనీలు సిద్ధమయ్యాయి.
వీటికి తోడు ఆకర్షణీయ డిస్కౌంట్లనూ కస్టమర్ల కోసం ఆటోమొబైల్ కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఇక ఈ నవంబర్లో దేశీ మార్కెటలోకి టాటా టియాగో సీఎన్జీ, 2021 మారుతి సుజుకి సెలెరియా, న్యూ ఆడి క్యూ5 ఫేస్లిఫ్ట్, న్యూ వోక్స్వ్యాగన్ టైగున్ ఫేస్లిఫ్ట్, స్కోడా కుషక్ 1.5ఎల్ డీఎస్జీ న్యూ వేరియంట్ మార్కెట్లో ఎంటరవుతున్నాయి.