ముంబై, జూన్ 23: ఫార్మా రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెండు ప్రభుత్వ రంగ సంస్థల్ని విక్రయించాలని యోచిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా వెల్లడించారు. శుక్రవారం ముంబైలో జరిగిన ఒక ఫార్మా సదస్సులో మాట్లాడుతూ ‘ప్రభుత్వానికి రెండు ప్లాంట్లు ఉన్నాయి.
వాటిని విక్రయించేదిశగా కదులుతున్నాం. వాటిని ప్రైవేటు రంగం నిర్వహిస్తుంది’ అని చెప్పారు. అయితే ప్రభుత్వం వాటాను అమ్మదల్చిన కంపెనీల పేర్లు, ప్రతిపాదనలకు సంబంధించిన ఇతర వివరాల్ని మంత్రి వెల్లడించలేదు.