న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: స్టార్టప్, ఫిన్టెక్ సంస్థలతో ప్రతినెల సమావేశం నిర్వహించాలని రిజర్వు బ్యాంక్కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ప్రతి నెల ఒకరోజు నిర్వహించనున్న ఈ సమావేశానికి రాజోర్పే, క్రెడ్, వెంచర్ క్యాపిటల్ సంస్థ పీక్ఎక్స్వీతోపాటు 50 సంస్థలకు చెందిన సీనియన్ ఉన్నతాధికారులు హాజరుకావాలని సూచించారు.
ప్రభు త్వం నుంచి ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి, డీపీఐఐటీ సెక్రటరీ రాజేశ్ కుమార్ సింగ్తోపాటు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రబి శంకర్ కూడా హాజరుకానున్నారు.