న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.1,085 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.727 కోట్ల లాభంతో పోలిస్తే 49 శాతం అధికమని పేర్కొంది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.20,102.84 కోట్ల నుంచి రూ.19,453.74 కోట్లకు పడిపోయినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది.