Russia-Ukraine War | ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను కేంద్రం తరలిస్తున్నది. ఆదివారం 11 విమానాలు ఉక్రెయిన్ ఇరుగు పొరుగుదేశాల నుంచి 2200 మందికి పైగా ఇండియన్స్ను తరలిస్తాయని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ తెలిపింది. శనివారం 15 విమనాల్లో సుమారు 3000 మందిని తరలించినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. 12 ప్రత్యేక, మూడు వాయుసేన (ఐఏఎఫ్) విమానాల్లో వారిని తరలించామని వివరించింది.
గత నెల 24 నుంచి ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడులు నిర్వహిస్తున్నది. దీంతో ఉక్రెయిన్ తన గగన తలాన్ని మూసేసింది. దీంతో ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను దాని పొరుగు దేశాలైన రొమేనియా, హంగరీ, స్లోవేకియా, పోలండ్ల నుంచి భారతీయ విమానాలు తరలిస్తున్నాయి.
మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ప్లేన్లు సీ-17లను ఉపయోగిస్తూ భారతీయులను తరలిస్తున్నది. ఇండిగో, ఎయిరిండియా, విస్తారా, స్పైస్జెట్ వంటి పౌర విమానయాన సంస్థలు ప్రత్యేక విమానాలను నడుపుతున్నాయి.
శనివారం హంగరీలోని బుడాపెస్ట్ నుంచి ఐదు, రొమేనియాలోని సుకేవా నుంచి నాలుగు, స్లోవేకియా నుంచి కోసికే నుంచి ఒకటి, పోలండ్లోని రెస్జోవో నుంచి రెండు విమానాల్లో భారతీయులను తరలించామని పౌర విమానయాన మంత్రిత్వశాఖ తెలిపింది. ఆదివారం బుడాపెస్ట్, కొసికే, రెస్జోవో, బుడాపెస్ట్ నుంచి 11 విమానాలు నడుపుతామని భావిస్తున్నట్లు పేర్కొంది.