Twitter | ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో నగదు కొరత (Negative Cash flow) తీవ్రంగా ఉందని ఆ సంస్థ సీఈవో, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) అన్నారు. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా 50 శాతం ఉద్యోగులను విధుల నుంచి తొలగించడం(Twitter Layoffs), ప్రకటనల ఆదాయం దాదాపు 50 శాతానికి పడిపోవడం (Ad Revenue), భారీ రుణభారం కారణంగా ఈ పరిస్థితి వచ్చిందని మస్క్ వివరించారు. ముందుగా ట్విట్టర్ను గాడినపెట్టేందుకు నగదు నిల్వల ఏర్పాటు చేసుకొనే (Positive Cash Flow) స్థితికి ట్విట్టర్ చేరుకోవాలని మస్క్ తెలిపారు. కాగా ట్విట్టర్ ఈ ఏడాది 4.5 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని అంచనావేయగా.. తర్వాత ఆ అంచనాలను 3 బిలియన్ డాలర్లకు తగ్గించారు.
ఇక ట్విట్టర్ను లాభాల బాట పట్టించేందుకు ఎన్బీసీ యూనివర్సల్ (NBC) కామ్కాస్ట్ మాజీ యాడ్ చీఫ్ అయిన లిండా యాకారినో(Linda Yaccarino)ను మస్క్ సీఈఓ(Twitter New CEO)గా నియమించాడు. యాకారినో జూన్ నుంచి ట్విట్టర్లో భాగస్వామ్యం కాగా.. ఆదాయం పెరిగేందుకు వీడియో క్రియేటర్స్, వాణిజ్య భాగస్వామ్యాలపై దృష్టి పెట్టాలని ట్విట్టర్ యోచిస్తోందని యాకారినో తెలిపింది.
Twitter New Ceo Linda Yaccarino
ట్విట్టర్ను టేకోవర్ చేసినప్పటి నుంచి మస్క్ లేఆఫ్స్ మొదలుకుని మైక్రోబ్లాగింగ్ సైట్లో పలు మార్పులు చేపట్టారు. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా 50 శాతం ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. అమెరికానే కాకుండా భారత్ సహా పలు దేశాల్లో లేఆఫ్స్ ప్రభావం చూపింది. ఇవేకాకుండా ట్విట్టర్లో రోజుకో కొత్త కండిషన్ తెస్తుండటం.. బ్లూ టిక్, సబ్ స్క్రిప్షన్(Blue Tick Subscription) అంటూ నిబంధనలు పెట్టడంతో చికాకులో ఉన్న యూజర్లు.. క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నారు.