Twitter-Musk | మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ అంచనాలు లెక్క తప్పాయి. రెండో త్రైమాసికంలో ఆదాయం తగ్గుముఖం పట్టింది. ట్విట్టర్ను టేకోవర్ చేస్తానని ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్మస్క్ ప్రకటించి, వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో ఇరువైపులా న్యాయ పోరాటానికి దిగాయి. ఇంతకుముందు కరోనా ఉధృతంగా సాగుతున్న వేళ 2020లోనూ ఒకశాతం ఆదాయం తగ్గుముఖం పట్టింది. కానీ, గత జూన్ త్రైమాసికంలో ట్విట్టర్ మొత్తం ఆదాయం 118 కోట్ల డాలర్లు. కానీ, మార్కెట్ విశ్లేషకులు మాత్రం 132 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా వేశారు. ట్విట్టర్ను ఎలన్మస్క్ టేకోవర్ చేసే అంశం పెండింగ్లో ఉండటంతో అనిశ్చితి నెలకొందని చెబుతున్నారు.
జూన్తో ముగిసిన రెండో త్రైమాసికంలో 8.8 మిలియన్ల కొత్త యూజర్లు ట్విట్టర్కు జత కలిశారు. రెండు వారాల క్రితం వరకు షేర్పై 54.20 డాలర్ల చొప్పున ట్విట్టర్ను ఎలన్మస్క్ కొనుగోలు చేసే అంశంపై అనిశ్చితి కొనసాగింది. ట్విట్టర్ యాజమాన్యం కూడా డీల్ ముగింపు కోసం ఆసక్తిగా ఎదురుచూసినట్లు సమాచారం. కానీ ఎలన్మస్క్ తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు ఈ నెల 8న ప్రకటించారు.
ట్విట్టర్ స్పామ్ ఖాతాల వివరాలు వెల్లడించడం లేదని పేర్కొంటూ.. మైక్రో బ్లాగింగ్ సైట్ కొనుగోలు ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఎలన్మస్క్ వెల్లడించారు. ఎలన్మస్క్ తీరుపై ట్విట్టర్ న్యాయ పోరాటానికి దిగింది. ఎలన్మస్క్ కూడా గట్టిగానే వాదిస్తున్నారు. ట్విట్టర్ పిటిషన్పై విచారణ తేదీని న్యాయమూర్తి ఖరారు చేశారు.