User Charges on Twitteries | ట్విట్టర్ యూజర్లపైన చార్జీ విధించనున్నట్లు టెస్లా సీఈవో ఎలన్మస్క్ వెల్లడించారు. 44 బిలియన్ డాలర్ల డీల్కు ట్విట్టర్ను ఎలన్మస్క్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ట్విట్టర్లో తీసుకురానున్న పలు మార్పులపై నిత్యం ఆయన స్పందిస్తున్నారు. ప్రత్యేకించి ట్విట్టర్ను వినియోగించుకునేవారిపై చార్జీలు విధిస్తామన్నారు. అయితే, ప్రతి ఒక్కరి నుంచి చార్జీలు వసూలు చేయబోమన్నారు.
ప్రభుత్వం, వ్యాపార వర్గాలకు చెందిన ట్వి్ట్టర్ యూజర్లపైనే స్వల్పంగా చార్జీలు వసూలు చేస్తామని ఎలన్మస్క్ ప్రకటించారు. దీనిపై స్పందించడానికి ట్విట్టర్ యజమాన్యం నిరాకరించింది. కొన్ని రోజులుగా ట్విట్టర్లో తేవాల్సిన మార్పుల గురించి ఎలన్మస్క్ పదేపదే చెబుతున్నారు. కొత్త ఫీచర్లను తేవడంతోపాటు అల్గారిథమ్స్ను ఓపెన్ సోర్స్గా మారుస్తామని చెప్పారు. బ్లూ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్లోనూ మార్పులు తప్పవన్నారు.
ఇటీవల ఒక కార్యక్రమంలో ఎలన్మస్క్ మాట్లాడుతూ.. మీడియాలోనూ, ఇంటర్నెట్లోనూ తనపై విమర్శలు వస్తున్న సంగతి తెలుసు అన్నారు. కొన్ని సార్లు అవి బాధ కలిగించినట్లు అవుతుందన్నారు. తనకూ ఫీలింగ్స్ ఉంటాయని, తానేమీ ఆండ్రాయిడ్ను కాదని చమత్కరించారు.