Twitter Board | టెస్లా సీఈవో ఎలన్మస్క్కు 44 బిలియన్ల డాలర్లకు ట్విట్టర్కు అప్పగించేందుకు మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. ఈ విషయమై దాఖలు చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్లో మంగళవారం తెలిపింది. గతవారం ట్విట్టర్ ఎంప్లాయీస్తో జరిగిన వర్చువల్ సమావేశంలో ట్విట్టర్ను టేకోవర్ చేయడానికి ఆసక్తితో ఉన్నట్లు బిలియనీర్ ఎలన్మస్క్ వెల్లడించారు.
అప్పటివరకు ట్విట్టర్ షేర్ విలువ.. మస్క్ ఆఫర్ ధర కంటే తక్కువగానే ఉంది. తాజాగా ట్విట్టర్ ఉద్యోగులతో వర్చువల్ భేటీలో మస్క్ ఆసక్తి బయటపడటంతో ఈ డీల్ వాస్తవ రూపం దాల్చే వరకు ఉన్న సందేహాలు పటాపంచలయ్యాయి. ట్విట్టర్ను ఎలన్మస్క్కు అప్పగించేందుకు సంస్థ ఇన్వెస్టర్లు, బోర్డు డైరెక్టర్లు ఏకగ్రీవంగా అంగీకరించినట్లు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్కు మంగళవారం లేఖ రాసింది ట్విట్టర్.
ఇప్పటికిప్పుడు ట్విట్టర్ డీల్ ముగిస్తే.. ఆ సంస్థ ఇన్వెస్టర్లు ఒక్కొక్కరికి షేర్పై 15.22 డాలర్ల లాభం లభిస్తుంది. కానీ ట్విట్టర్ షేర్ మంగళవారం 39.99 డాలర్ల నుంచి మూడు శాతం పెరిగాయి. ఇప్పటికీ మస్క్ ఆఫర్ చేసిన 54.20 డాలర్ల కంటే ట్విట్టర్ షేర్ విలువ తక్కువే.