న్యూఢిల్లీ : భారత్లో ట్రయంఫ్ టైగర్ స్పోర్ట్ 660 బైక్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. భారత్లో ఈ బైక్ ఎంట్రీ ఎప్పుడనే వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ ట్రయంఫ్ టైగర్ ఫ్యామిలీ ఎంట్రీలెవెల్ బైక్కు ప్రీ ఆర్డర్స్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
ట్రయంఫ్ టైగర్ స్పోర్ట్ 660ను రూ 50,000 టోకెన్ అమౌంట్తో భారత్లో కస్టమర్లు బుక్ చేసుకోవచ్చు. టైగర్ స్పోర్ట్ 660 టాల్ విండ్స్క్రీన్, మాస్య్కులర్ లుకింగ్ ఫ్యూయల్ ట్యాంక్, ఎల్ఈడీ పైలట్ ల్యాంప్లతో కూడిన ట్విన్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్తో అగ్రెసివ్ లుక్తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.