Cyber Fraud in Banks | ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్.. ఆన్లైన్ లావాదేవీలే.. వాటితోపాటు బ్యాంకుల్లో సైబర్ మోసాలు కూడా శరవేగంగా పెరిగిపోయాయి. గత ఐదేండ్లలో సైబర్ ఫ్రాడ్ 21 రెట్లకు పైనే నమోదయ్యాయి. వాటిల్లో ప్రైవేట్ బ్యాంకుల్లోనే అత్యధికం. ఆర్బీఐ సిటిజన్ సైబర్ ఫైనాన్సియల్ ఫ్రాడ్ (సీసీఎఫ్ఎఫ్) నివేదిక గణాంకాల ప్రకారం నగదు మోసాలు 300 శాతం పెరిగాయి.
2016-17 ఆర్థిక సంవత్సరంలో 3223 కార్డ్/ ఇంటర్నెట్ ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయి. ఏటీఎంలు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మోసాలు జరిగాయని ఫిర్యాదులు అందాయి. కానీ గతేడాది 2020-21 నాటికి సైబర్ మోసాల కేసులు 69,410కి చేరాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 45.56 కోట్ల మేరకు మోసాలు జరిగాయని కేసులు రికార్డయ్యాయి. 2020-21 నాటికి రూ.200 కోట్ల పై చిలుకు ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో అత్యధికం ప్రైవేట్ బ్యాంకుల కస్టమర్లవే కావడం గమనార్హం.
2020-21 ఆర్థిక సంవత్సరంలో
టాప్-5 బ్యాంకుల్లో సైబర్ ఫ్రాడ్ కేసుల వివరాలు
బ్యాంకు — — — — ఫ్రాడ్ మొత్తం
(రూపాయల్లో)
కొటక్ మహీంద్రా — — 64.20 కోట్లు
యాక్సిస్ బ్యాంక్ —– 29.62 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ — 25.74 కోట్లు
ఎస్బీఐ — — — — — 12.60 కోట్లు
అమెరికా ఎక్స్ప్రెస్ — 12.04 కోట్లు
బ్యాంకు కస్టమర్లతో సైబర్ ఫ్రాడ్స్ జరిగిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. 2016-17లో డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ లింక్డ్ ఫ్రాడ్స్ కేసులు 1,075 నమోదు కాగా, 2020-21లో 26,522 కేసులు రికార్డయ్యాయి.
2020-21 ఆర్థిక సంవత్సరంలో
టాప్-5 రాష్ట్రాల్లో సైబర్ ఫ్రాడ్ కేసులివే!
రాష్ట్రం — —– కేసుల సంఖ్య
మహారాష్ట్ర — — 26,522
ఢిల్లీ ఎన్సీఆర్ – 7,774
తమిళనాడు — 5,659
గుజరాత్ — —- 4,671
హర్యానా — —- 5,605