TRAI | గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉంది.. కానీ, రోజువారీగా వచ్చే ఫోన్ కాల్స్ తో పోలిస్తే వివిధ సంస్థల, బ్రాండ్ల ప్రమోషనల్ కాల్స్, సందేశాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఒక్కో మొబైల్ యూజర్కు సరాసరి 12 స్పామ్ మెసేజ్లు అందుకుంటున్నారని ఓ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో టెలికం సంస్థలకు ట్రాయ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రమోషనల్, స్మామ్ మేసేజ్ ల విషయమై కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఇటువంటి సందేశాలు పంపడానికి ముందు యూజర్ల అనుమతి తీసుకోవాలని పేర్కొంది. తమ ఆదేశాలు పాటించని సంస్థలపై జరిమానా విధిస్తామని కూడా స్పష్టం చేసింది.
దీని ప్రకారం రుణాలు, స్కీంలు అంటూ వివిధ బ్యాంకులు, ఫిన్ టెక్ సంస్థలు, రియాల్టీ సంస్థల ఎస్ఎంఎస్లు పంపడానికి ముందు సంబంధిత యూజర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక యూజర్ కు కంటెంట్ పంపాలంటే.. సంబంధిత టెలికం సంస్థ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. అటుపై తన యూజర్కు టెలికం సంస్థ 127*** షార్ట్ కోడ్ తో ఒక ఎస్ఎంఎస్ పంపడంతోపాటు.. అందులో దేని కోసం అనుమతి కోరుతున్నారో తెలియ జేస్తుంది.
ఆ మెసేజ్ కు యూజర్ అనుమతి ఇవ్వవచ్చు.. ఇవ్వక పోవచ్చు. పర్మిషన్ ఇవ్వకపోతే సదరు సంస్థ అటువంటి ఎస్ఎంఎస్ లు పంపకుండా నిలువరించాలి. ప్రమోషనల్ మెసేజ్లకు ఇచ్చిన పర్మిషన్లను ఎప్పుడైనా సులువుగా ఉపసంహరించుకోవడానికి ఆన్ లైన్ పోర్టల్ సిద్ధం చేయాలని టెలికం సంస్థలను ట్రాయ్ సూచించింది. తొలుత ప్రమోషనల్ ఎస్ఎంఎస్లు, తదుపరి కాల్స్ కట్టడిపైనా ట్రాయ్ ఫోకస్ చేయనున్నది. తక్షణం ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.