Toyota Cars | జపాన్ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ (Toyoya Kirloskar Motor) సెలెక్టెడ్ మోడల్ కార్ల ధరలు ఒకశాతం పెంచనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని గురువారం తెలిపింది. ఇన్ పుట్ కాస్ట్, నిర్వహణ ఖర్చులు పెరగడంతో ధరలు పెంచక తప్పడం లేదని పేర్కొంది. ఈ ఏడాది టయోటా కిర్లోస్కర్ తన కార్ల ధరలు పెంచడం ఇది రెండోసారి. ఇంతకుముందు జనవరిలో తొలిసారి కార్ల ధరలు పెంచేసింది.
హ్యాచ్ బ్యాక్ మోడల్ గ్లాంజా నుంచి ప్రీమియం ఎస్యూవీ ఫార్చూనర్ కార్ల ధరలు రూ.6.86 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.51.44 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పెరుగుతాయని తెలిపింది. పెరిగిన ధరలు హైలక్స్, ఇన్నోవా హైక్రాస్, ఇన్నోవా క్రిస్టా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి ధరలు కూడా పెరుగుతాయి.
ఇంతకుముందు మరో కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా సైతం వచ్చేనెల నుంచి అన్ని కార్ల ధరలు పెరుగుతాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా ఇండియా సైతం వచ్చేనెల ఒకటో తేదీ నుంచి అన్ని మోడల్ కార్లపై మూడు శాతం ధరలు పెరుగుతాయని తెలిపింది. ఈ ఏడాదిలో కియా కార్ల ధరలు పెంచడం ఇదే తొలిసారి.