న్యూఢిల్లీ, జూలై 6: వాహన ధరలను పెంచుతున్నట్టు టయోటా కిర్లోస్కర్ మోటర్ ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం అధికమవడం వల్లనే వాహన ధరలను ఒక్క శాతం పెంచాల్సి వచ్చిందని ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యునర్ మాడళ్లు మరింత ప్రియంకానున్నాయి.