Toyota | ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ ‘టయోటా (Toyota)` ప్రొడక్షన్ యూనిట్లలో కార్ల తయారీ ప్రారంభమైంది. సాంకేతిక లోపంతో మంగళవారం జపాన్ లోని 14 ప్రొడక్షన్ యూనిట్లకు 12 ప్లాట్లలో తాత్కాలికంగా ఉత్పత్తి నిలిపేశారు. ప్రొడక్షన్ సిస్టమ్పై సైబర్ దాడి జరిగిందని భావిస్తున్నారు. 14 ప్రొడక్షన్ యూనిట్లలో మియటా, టయోటా అనుబంధ దైహత్సు మోటార్ యూనిట్లలో మధ్యాహ్నం వరకూ ప్రొడక్షన్ కొనసాగింది.
సాంకేతిక లోపంతో మంగళవారం డే షిఫ్ట్లో ప్రొడక్షన్ నిలిపివేశారు. దీంతో ఆ సిస్టమ్ యావత్ రీ బూట్ చేసి మంగళవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత (జపాన్లో బుధవారం) ఉత్పత్తి ప్రారంభించినట్లు టయోటా మోటార్ కార్పొరేషన్ వెల్లడించింది. 14 ప్రొడక్షన్ ప్లాంట్లలో 25 ప్రొడక్షన్ లైన్లలో ఉత్పత్తి ప్రారంభమైంది.
ప్రపంచవ్యాప్తంగా టయోటా ప్రొడక్షన్ ప్లాంట్లలో జపాన్ లోనే మూడో వంతు కార్ల తయారీ జరుగుతుంది. సాంకేతిక లోపానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే, తమ కంపెనీపై సైబర్ అటాక్ జరుగుతుందని నమ్మడం లేదని టయోటా అధికార ప్రతినిధి తెలిపారు. సాంకేతిక లోపానికి కారణాలపై దర్యాప్తు కొనసాగుతున్నదన్నారు.
గతేడాది ఫిబ్రవరిలోనూ తమ కార్ల విడి భాగాల సరఫరాదారుల్లో ఒక సంస్థపై రాన్సమ్ వేర్ అటాక్తో అన్ని ప్రొడక్షన్ యూనిట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. ఆ తర్వాత ఉత్పత్తి ప్రారంభించడానికి పలు రోజులు పట్టింది. దీనివల్ల గతేడాది ఫిబ్రవరి నెల కార్ల ఉత్పత్తి ఐదు శాతం తగ్గినట్లు తెలుస్తున్నది.
ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య కార్ల తయారీ 29 శాతం పెరిగింది. రెండేండ్లలో కార్ల ఉత్పత్తి ఇలా పెరగడం ఇదే తొలిసారి. జనవరి-జూన్ మధ్య ప్రతి రోజూ సగటున జపాన్లో 13,500 కార్లు ఉత్పత్తి చేశారు.