న్యూఢిల్లీ : కియా కారెన్స్కు దీటుగా టొయోటా 560బీ ఎంపీవీ భారత్లో వచ్చే ఏడాది లాంఛ్ కానుంది. టొయోటా 560బీ కోడ్నేమ్తో 2023లో రానున్న టొయోటా ఎంపీవీ డీఎన్జీఏ టెక్నాలజీతో కస్టమర్లను ఆకట్టుకోనుంది.
మారుతి సుజుకి ఎర్టిగా, టొయోటా ఇన్నోవా క్రిస్టా మధ్య సెగ్మెంట్ను టార్గెట్ చేస్తూ టొయోటా 7 సీటర్ ఎంపీవీ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ కారు కియా కారెన్స్, మహీంద్ర మరజో వంటి ఎస్యూవీలకు పోటీ ఇవ్వనుంది. టొయోటా హైబ్రిడ్ ఇంజన్ టెక్నాలజీతో ఈ ఎంపీవీ రానుంది. మారుతి సుజుకితో కలిసి న్యూ టొయోటా ఎంపీవీని డెవలప్ చేయనున్నారు.
ఈ ఏడాది టొయోటా-మారుతి జోడీతో సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ కూడా లాంఛ్ కానుండటంతో ఈ ఎస్యూవీ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా హారియర్, ఎంజీ హెక్టార్లకు దీటైన పోటీ ఇవ్వనుందని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.