ధర రూ.48,900
న్యూఢిల్లీ, జూలై 5: ఎలక్ట్రిక్ మొబిలిటి స్టార్టప్ టౌచే.. కొత్త తరం ఎలక్ట్రిక్ సైకిల్ హీలియో హెచ్100ను సోమవారం దేశీయ మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.48,900. పెడల్స్ విధానంలో పరిచయమైన ఈ సైకిల్లో రెండు వేరియంట్లను అందుబాటులోకి తెచ్చింది. ఒక్కసారి చార్జింగ్పై 60 కిలోమీటర్లు, 80 కిలోమీటర్లు ప్రయాణించే వీలును కల్పించింది. హీలియో ఎం100, ఎం200, హెచ్200 మోడల్స్లో లభించే ఈ సైకిల్ కోసం బుకింగ్స్ మొదలయ్యాయి. బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటర్, కంట్రోలర్ ఆఫ్ ది బైక్స్కు 18 నెలల వారంటీ, ఫ్రేమ్పై రెండేండ్ల వారంటీ ఉన్నది.