TCS & Reliance | పెరిగిపోతున్న ధరలు.. వాటిని కట్టడి చేయడానికి వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకుల వడ్డీరేట్ల పెంపు.. పెరిగిపోయిన ముడి చమురు ధరల ప్రభావంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీన పడింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించడంతో టాప్-10 సంస్థలు రూ.3.91 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. మార్కెట్ లీడర్స్గా పరిగణించే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా నష్టపోయాయి. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 2,943.02 (5.42 శాతం) పాయింట్లు నష్టపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 908.30 (5.61 శాతం) పాయింట్లు పతనం అయ్యాయి.
టాప్-10 స్క్రిప్ట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,91,620.01 కోట్లు నష్టపోయింది. వాటిల్లో టీసీఎస్ అత్యధికంగా నష్టపోయింది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,01,026.4 కోట్లు నష్టపోయి, రూ.11,30,372.45 కోట్ల వద్ద స్థిర పడింది. రిలయన్స్ ఎం-క్యాప్ రూ. 84,352.76 కోట్ల పతనంతో రూ.17,51,686.52 కోట్లకు చేరుకున్నది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.37,656.62 కోట్ల మేరకు కోల్పోయి రూ.5,83,846.01 కోట్ల వద్ద ముగిసింది. ఎల్ఐసీ ఎం-క్యాప్ రూ.34,787.49 కోట్లు నష్టపోయి రూ.4,14,097.60 కోట్ల వద్ద స్థిర పడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.33,507.66 కోట్లు పతనమై రూ.7,16,373.13 కోట్లకు చేరుకున్నది. హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.22,977.51 కోట్లు కోల్పోయి రూ. 3,72,442.63 కోట్ల వద్ద నిలిచింది.
ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 22,203.69 కోట్లు నష్టపోయి రూ.4,78,540.58 కోట్లకు చేరుకున్నది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.20,535.43 కోట్లు కోల్పోయి రూ.4,96,351.15 కోట్లతో సరిపెట్టుకుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.18,563.19 కోట్లు పతనమై రూ. 3,93,575.37 కోట్ల వద్ద ముగిసింది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,009.26 కోట్ల నష్టంతో రూ.3,53,604.18 కోట్ల వద్ద స్థిర పడింది. టాప్-10 సంస్థల్లో రిలయన్స్ సారధ్యం వహిస్తుండగా, తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ఐసీ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్ నిలిచాయి.