ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 60,522 వద్ద నష్టాలతో.. నిఫ్టీ 6 పాయింట్లు స్వల్ప లాభంతో 18,074 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.94 వద్ద కొనసాగుతోంది.సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్ఎం, సన్ఫార్మా, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్,టెక్ మహీంద్రా,టాటా స్టీల్,ఎల్అండ్టీ, డాక్టర్ రెడ్డీస్,మారుతీ షేర్లు రాణిస్తున్నాయి.హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్గ్రిడ్, నెస్లే ఇండియా,బజాజ్ ఫిన్సర్వ్,యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.
అమెరికాలో ఇన్ఫ్రా బిల్లు ఆమోదం పొందనుండడం కూడా సూచీలపై నేడు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.