న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: టెస్లా అమ్మకాలు పెంచుకోవడానికి, కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ఈఎంఐ, ఎక్సేంజ్ రాయితీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పెట్రోల్, డీజిల్ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లను ఎలక్ట్రిక్ కార్ల వైపు మళ్లించడానికి సంస్థ..రూ.3 లక్షల వరకు ఎక్సేంజ్ ఇన్సెంటివ్ ఇస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది.
దీంతోపాటు మాడల్ వైను కొనుగోలు చేసిన వారు డౌన్పేమెంట్ కింద రూ.6 లక్షలు చెల్లించి, నెలకు రూ.49 వేల ఈఎంఐతో కారు అందిస్తున్నది.