న్యూఢిల్లీ, మార్చి 1: దేశీయ మార్కెట్లోకి మరో మూడు కార్లు అందుబాటులోకి రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా ఎస్యూవీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని హ్యుందాయ్, మహీంద్రా, చైనాకు చెందిన ఈవీల తయారీ సంస్థ బీవైడీ కూడా తమ నూతన మాడళ్లను మార్చి నెలలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాయి. వీటిలో హ్యుందాయ్ సరికొత్తగా ఎన్-లైన్ మాడల్ను పరిచయం చేస్తుండగా..మహీంద్రా ఎక్స్యూవీ 300 ఫేస్లిఫ్ట్, బీవైడీ తన తదుపరి మాడల్ను ప్రవేశపెట్టబోతున్నది. వీటి వివరాలు..
మహీంద్రా ఎక్స్యూవీ 300
మార్కెట్లోకి నయా ఎక్స్యూవీ300ని విడుదల చేయబోతున్నది మహీంద్రా అండ్ మహీంద్రా. కారు ఇంటీరియర్తోపాటు బయటసైడు డిజైనింగ్లో పలు మార్పులు చేసిన సంస్థ..బంపర్లు, లైటింగ్ సెటప్ను అప్డేట్ చేసి విడుదల చేస్తున్నది. మార్చి నెలలో విడుదలకానున్న ఈ మాడల్ ధర రూ.9 లక్షల స్థాయిలో ఉంటుందని అంచనా.
బీవైడీ సీల్
చైనాకు చెందిన ఈవీల తయారీ సంస్థ బీవైడీ..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఈవీని అందుబాటులోకి తీసుకురాబోతున్నది. మార్చి 5న రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్(61.4 కిలోవాట్లు, 82.5 కిలోవాట్లు), సింగిల్ చార్జింగ్తో 570 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇచ్చే వాహనాలను విడుదల చేస్తున్నది. 15 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రెండు వైర్లెస్ చార్జర్లు వంటి టెక్నాలజీతో తయారు చేసింది. ఈ కారు ధర రూ.55 లక్షల స్థాయిలో ఉంటుందని అంచనా.