కీసర, ఏప్రిల్ 26 : రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండల కేంద్రంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి చామకూర మల్లారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఈ యాసంగిలో విస్తారంగా వర్షాలు పడటం వల్ల, సీఎం కేసీఆర్ దూరదృష్టి ద్వారా సకాలంలో సాగునీరు అందించడంతో గతంలో కంటే ఈసారి ఎక్కువగా 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యంను సుమారు రూ. 58 కోట్ల అంచనా వేయడం జరిగిందన్నారు.
కీసర, ఏప్రిల్ 26 : కీసర మండల పరిషత్ కార్యాలయం వద్ద సోమవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 18 మందికి మంత్రి చామకూర మల్లారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద మంజూరైన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, ఎంపీపీ మల్లారపు ఇందిరాలక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ జె.సత్తిరెడ్డి పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్, ఏప్రిల్ 21: రాష్ట్రంలో అన్నదాత పండించిన ప్రతి గింజను కొనుగోలుచేసి, 48 గంటల లోపే రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం డబ్బులు జమ చేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ఎదులాబాద్, మాదారం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మేడ్చల్ జిల్లాలో 12 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు ఏ గ్రేడ్ రకం ధాన్యానికి రూ.1,888, కామన్ గ్రేడ్ రకం ధాన్యానికి రూ.1,869 ప్రభుత్వం మద్దతు ధరగా నిర్ణయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, డీసీఎంసీ ఉపాధ్యక్షుడు మధుకర్రెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, సర్పంచ్లు సురేశ్, యాదగిరి స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.