న్యూఢిల్లీ : భారత్లో రూ. 1,27,999 పలికే యాపిల్ ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ (iPhone 14 Pro Max) ఐఫోన్లలో అత్యంత ఖరీదైనది. అయితే ఈ వేరియంట్లో కేవియర్ కస్టమైజ్డ్ డైమండ్ స్నోఫ్లేక్ వెర్షన్ ఏకంగా రూ. 5 కోట్లు పలుకుతోంది. ఈ ధర భారత్లో ప్రస్తుతం రూ. 3.7 కోట్లకు లభిస్తున్న లంబోర్గిని హరకేన్ సూపర్కార్ కంటే అధికం.
బ్రిటిష్ జ్యూవెలరీ బ్రాండ్ గ్రాఫ్ కొలాబరేషన్తో ఈ స్నోఫ్లేక్ ఎడిషన్ రూపొందింది. వీటిలో కేవలం మూడు ఎక్ల్సూజివ్ డివైజ్లు మాత్రమే ప్రస్తుతం లభిస్తున్నాయి. డైమండ్ స్నోఫ్లేక్ ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ మోడల్ ప్రత్యేకత ఏంటంటే బ్యాక్ప్లేట్కు పెండెండ్ అమర్చారు. ఈ పెండెంట్ను ప్లాటినం, వైట్ గోల్డ్తో పాటు గుండ్రటి డైమండ్స్తో పొదిగారు. ఈ పెండెంట్ ఖరీదే రూ. 62 లక్షల పైమాటే.
దీనితో పాటు 18కే వైట్గోల్డ్ బ్యాక్ప్లేట్తో పాటు 570 వజ్రాలను ఇందులో అమర్చారు. ఫోన్ వెనుకభాగంలో డైమండ్స్ కోటింగ్ మెరుపుల వల్ల కూడా ఈ మోడల్ అత్యంత ఖరీదైనదిగా మారిందని చెబుతున్నారు. డైమండ్ స్నోఫ్లేక్ వెర్షన్ను కొనుగోలు చేయాలనుకునే వారు కేవియర్ అధికారిక వెబ్సైట్ నుంచి దీన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్పై కంపెనీ ఏడాది వారెంటీ ఆఫర్ చేస్తోంది.
Read More :