Dhanteras | అక్షయ తృతీయ.. దంతేరాస్ పర్వదినాలు.. ఆ రోజు ఏ కార్యం తలపెట్టినా మంచి జరుగుతుందని నానుడి. దంతేరాస్ పర్వదినం.. ఐదు రోజులు సాగే దీపావళి వేడుకలో తొలి రోజు వస్తుంది. ప్రత్యేకించి భారతీ మహిళలు వీలైతే దంతేరాస్ నాడు పిసరంత బంగారం కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు. అలా చేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని చెబుతారు. అంత పవిత్రత గల దంతేరాస్ ఈ నెల 24న వస్తున్నది. ఫిజికల్ గోల్డ్ కొనుగోలు చేయొచ్చు.. కస్టమర్లు బంగారం కొని దగ్గర పెట్టుకోవాలనుకుంటే కొన్ని సంస్థలు హోం డెలివరీ ఆప్షన్ కూడా ఇచ్చాయి.
అవకాశం ఉంటే ఆన్లైన్లో డిజిటల్ గోల్డ్లోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ దఫా ఆన్లైన్లో బంగారం కొనుగోలు చేయడం డిఫరెంట్.. సేఫ్ గోల్డ్ సంస్థతో కలిసి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ఆన్లైన్లో కొనుగోలు చేసే వారి పేరిట సంబంధిత వాలెట్ను ఇన్సూర్ చేస్తారు. కొనుగోలుదారులు రూపాయికే 24 క్యారట్ల బంగారం కొనుగోలు చేయొచ్చు. చెల్లింపులు జరిపిన తర్వాత కొనుగోలుదారులకు ఇన్వాయిస్తోపాటు కొనుగోలు చేసిన వాలెట్ విలువ బంగారాన్ని వారి ఖాతాలో జమ చేస్తారు. ఇలా ఆన్లైన్లో కొనుగోలుచేసిన బంగారాన్ని ఎప్పుడైనా లైవ్ మార్కెట్ రేట్లకు విక్రయించొచ్చు.
ప్రస్తుతం భారత్లో మూడు సంస్థలు డిజిటల్ గోల్డ్ కొనుగోలుపై ఆఫర్లు ఇస్తున్నాయి. అలా ఆఫర్లు ఇస్తున్న సంస్థలివే.. ఎంఎంటీసీ-పీఏఎంపీ ప్రైవేట్ లిమిటెడ్, ఆగుమెంట్ గోల్డ్, డిజిటల్ గోల్డ్ ఇండియా విత్ ఇట్స్ సేఫ్ గోల్డ్ బ్రాండ్.
సేఫ్ గోల్డ్తో కలిసి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ డిజిగోల్డ్ ఆఫర్స్ తీసుకొచ్చింది. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు రెండు నిమిషాల్లో 24 క్యారట్ల బంగారంలో పెట్టుబడులు పెట్టొచ్చు. ఇలా కొనుగోలు చేసిన బంగారాన్ని సేఫ్గోల్డ్లో ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా స్టోర్ చేస్తారు. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ గల కుటుంబ సభ్యులు, స్నేహితులకు డిజిగోల్డ్ గిఫ్ట్ కూడా ఇవ్వొచ్చు.