హైదరాబాద్, ఏప్రిల్ 16: బ్రాండెడ్ పరుపుల విక్రయ సంస్థ ది స్లీప్ కంపెనీ.. హైదరాబాద్లో మరో స్టోర్ను ప్రారంభించింది. దీంతో నగరంలో సంస్థకు ఇది 8వ స్టోర్ కాగా, దేశవ్యాప్తంగా 75వ స్టోర్ కావడం విశేషం. ఈ సందర్భంగా కంపెనీ కో-ఫౌండర్ ప్రియాంకా సాలోట్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణలో 12 స్టోర్లు ఉండగా, వచ్చే ఏడాది చివరి నాటికి వీటిని రెండింతలు పెంచనున్నట్లు ఆమె ప్రకటించారు.
కంపెనీకి వచ్చిన మొత్తం ఆదాయంలో బెంగళూరు, హైదరాబాద్ వాటా అధికంగా ఉండటంతో ఇక్కడి వ్యాపారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. అలాగే 2023లో రూ.350 కోట్లుగా ఉన్న టర్నోవర్, రెండు నుంచి మూడేండ్లకాలంలో రూ.1,000 కోట్లకు చేరుకుంటున్నదని ఆశిస్తున్నట్లు తెలిపారు.