హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ): విమాన సేవలను అందించడంలో శంషాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నది. తాజాగా వెల్లడించిన ఎయిర్ పోర్టు ఆన్ టైం పర్ఫార్మెన్స్లో అంతర్జాతీయ ఎయిర్ పోర్టులతో పోటీపడి నాలుగో స్థానంలో నిలిచింది. ఇక దేశీయ విమానాశ్రయ జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నది. తాజాగా స్కై ట్రాక్స్ అవార్డు-2023 పోటీ పడుతుండగా… మోస్ట్ పంక్చువల్ ఎయిర్ పోర్టు జాబితా బరిలో నిలిచింది.
ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్ నుంచి విదేశాలకు రాకపోకలు చేసిన ప్రయాణికులు స్కైట్రాక్స్ అవార్డు కోసం నిర్వహిస్తున్న సర్వేలో పాల్గొని
https://www.worldairportsurvey.com/Surveys/Airport/best_airport.html ద్వారా ఓటు వేయాలని ఆర్జీఐఏ వర్గాలు ట్వీట్ చేయగా… నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభించింది.