ఏఐజీ హాస్పిటల్స్ వాటాపై చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి స్పందన
హైదరాబాద్, డిసెంబర్ 17: హైదరాబాద్లోని ఏఐజీ (ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ) హాస్పిటల్స్లో వాటాను ప్రమోటర్లు విక్రయించడం లేదని సంస్థ చైర్మన్ డీ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. వాటాను అమ్మకానికి పెట్టినట్లు పలు మీడియా సాధనాల్లో వచ్చిన వార్తలు వాస్తవం కాదని స్పష్టంచేసారు. ఈ హాస్పిటల్స్ను ప్రమోట్ చేసిన నాగేశ్వర్ రెడ్డి, ప్రస్తుత షేర్హోల్డర్ అయిన క్వాడ్రియా క్యాపిటల్లు కలసి మెజారిటీ వాటాను విక్రయిస్తారని మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఏఐజీలో పీఈ ఫండ్ క్వాడ్రియా క్యాపిటల్కు 30 శాతం వాటా ఉండగా, ప్రమోటర్ల వద్ద 70 శాతం వాటా ఉంది. మెజారిటీ వాటాను అట్టిపెట్టుకోవడానికి కట్టుబడి ఉన్నామని, నాణ్యమైన వైద్య సేవల్ని కొనసాగిస్తామని చైర్మన్ వివరించారు.