ముంబై, అక్టోబర్ 11:మెర్సిడెజ్ బెంజ్ అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్యకాలంలో 12,768 కార్లను డెలివరీ చేసింది.ఈ సందర్భంగా మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ మాట్లాడుతూ.. చిప్ల కొరత ఉన్నప్పటికీ ప్రస్తుత పండుగ సీజన్లో సకాలంలో కొనుగోలుదారులకు తాము బుకింగ్ చేసుకున్న వాహనాలను అం దించడానికి ప్రయత్నించనున్నట్టు చెప్పారు.
విడిభాగాలు సరఫరాలో జాప్యం జరగడంతో ఇప్పటికీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు, దీంతో డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తి చేయలేకపోతున్నామని తెలిపారు.